Monday, January 19, 2009

దైవం మానుష రూపం లో...

ఎడారిలో నేనొంటరినైతే...

వర్షం నన్ను కౌగిలించుకుంది.

కష్టాల కడలిలో నేనీదుతుంటే...

చిరునవ్వొకటి నన్ను పలకరించింది.

సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...

కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.

బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...

దైవం నన్ను విముక్తుడిని చేసింది.

భయం నన్ను నీలా చేస్తే...

నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.

నిరాశ నన్ను మరణించమంటే...

ఆశ నన్ను జీవించమంది.

పగ నన్ను రాక్షసుడిని చేస్తే...

ప్రేమ నున్ను దైవంలా మార్చింది.


ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...

నేనే అందరినీ నాలా చేస్తా...

అందరిలో దైవాన్ని చూస్తా.

Note: వర్షం నన్ను కౌగిలించుకుంది, అనే మాట ఆమధ్య సాక్షిలో ఎం డి యాకూబ్ పాషా గారు వ్రాసిన ఆర్టికల్ లో నన్ను ఆకర్షిచింది. ఆలోచిస్తుంటే ఈ వాక్యాలు తట్టాయి.

I CAN NOT SAY I LOVE YOU WITHOUT SAYING I

4 comments:

Anonymous,  January 20, 2009 at 8:05 AM  

అత్యద్భుతం గా వుంది ..
ఎడారిలో వర్షం .. కష్టాలలో చిరునవ్వు .. సుఖాలలో కర్తవ్యం .. బంధాలలో దైవం .. భయానికి అహం(self respect) .. నిరాశలో ఆశ .. పగకు ప్రేమ ..

Bolloju Baba May 6, 2009 at 11:12 PM  

చాలా బాగుంది. మంచి
భిన్నవిషయములను బింబప్రతిబింబములవలే చెప్పటం గొప్ప అందాన్నిచ్చిందీ కవితకు. (అలా చెప్పటాన్ని దుష్టాంతాలంకారము అంటారనుకుంటా)

వాక్యాన్ని ధ్వంశం చేస్తే మరింత చిక్కపడుతుంది ఈ కవిత గమనించారా? కొద్దిగా గందరగోళం అయ్యే పరిస్థితే అనుకోండి. కానీ బాగుంటుంది.

అంటే
1.ఎడారిలో నేనొంటరినైతే...
2.కష్టాల కడలిలో నేనీదుతుంటే...
........

1.1వర్షం నన్ను కౌగిలించుకుంది.
2.1చిరునవ్వొకటి నన్ను పలకరించింది


మంచి ఉపమానాలు ఎన్నుకొని కవితకు గొప్ప అందాన్ని ఇచ్చారు.

బొల్లోజు బాబా

మరువం ఉష July 30, 2009 at 9:01 AM  

"బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...
దైవం నన్ను విముక్తుడిని చేసింది"

గీతాచార్య, పైన పంక్తులు ఒక్కోసారి నన్నీ నిర్వేదంలోకి తోస్తాయి "జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు? " http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html అంతలోనే కార్యోన్ముఖురాల్ని చేస్తాయి. నేనింకేదో చేయాలి అని తట్టిచెప్తాయి. మీ కవితని బాబా గారు బాగా విశ్లేషించారు. అంకన్నా నేనింకేమి అనగలను. పైకి క్రిందకి చదివాను మళ్ళీ మళ్ళీ...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP