Tuesday, November 4, 2008

సెహ్వాగ్ - హర్భజన్

వీరేంద్ర సెహ్వాగ్ కి తానూ ఢిల్లీ నుంచీ వచ్చానని మహా పొగరు. ఆ పొగరంతా సర్దార్జీ ఐన హర్భజన్ మీద చూపుతుంటాడు. ఐతే మన భజ్జీ కూడా తక్కువేమీ తినలేదు.

ఒకసారేమైందంటే...

"నేను దేశ రాజధాని నుంచీ వచ్చాను. మా నగరం లో ఎందఱో దేశ భక్తులు జన్మించారు. ఒకవేళ జన్మించక పోయినా వారందరూ మా నగరం లో ఉన్నారు." అని సెహ్వాగ్ అన్నాడు.

"రాష్ట్రం లోనూ తక్కవా 'కేసరి' అనే బిరుదు పొందిన వ్యక్తీ మా సొంతం" దానికి సమాధానంగా భజ్జీ.

ఐతే మనం ఒక పందెం వేసుకుందాం. ఎవరురాష్ట్రాల వారి దేశ భక్తులని వారు చెపుదాం. చెప్పిన ప్రతీసారీ అవతల వారి ఒక వెంట్రుకని పీకాలి." (సెహ్వాగ్ కి భజ్జీ పొడుగు వెంత్రుకలంటే కొంచం అసూయ.

భజ్జీ ఓకే అన్నాడు.

పందెం మొదలైంది. ముందు భజ్జీ ఒక పేరు చెప్పి సెహ్వాగ్ వెంట్రుకని పీకాడు. ఈసారి వీరు వంతు. తానొక పేరు చెప్పి భజ్జీ వెంట్రుకని పీకాడు. కొంత సేపటికి భజ్జీకి పేర్లు తట్టటంలేదు. మధ్యలో వీరూ కొందరు పంజాబీలని ఢిల్లీ లో ఉన్నారనే సాకుతో కబ్జా చేసి భజ్జీ వెంత్రుకాలని పీకాడు. సందర్భంలో వీరూ లాలా లజ్పత్ రాయ్ పేరుని కూడా కబ్జా చేశాడు. దాంతో భజ్జీకి మండింది.

కొంసేపు ఆలోచించి, తన వంతు రాగానే 'జలియన్ వాలా బాగ్' అని వీరూ జుట్టు అంతా పీకేశాడు. అప్పటి నుంచీ సెహ్వాగ్ మనకి గుండుతోనే దర్శనం ఇస్తున్నాడు.

ఇది మా ఫ్రెండ్ చైతన్య చెప్పింది. జోక్ ట.

:నోట్: సరదాకి మాత్రమే వ్రాసింది. వీరేంద్ర సెహ్వాగ్ అలాంటి వాడు కాదు. పైగా భజ్జీ వీరూ ఫ్రెండ్స్. గంగూలీ శిష్యులు కూడా.

Read more...

Saturday, November 1, 2008

ఐసు - బిప్పు రూలు.

ఒకప్పుడు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్', 'భీమవరం బిపాషా బసు' అని ఇద్దరమ్మాయిలు స్నేహితులు. ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం. పెళ్లి కాక ముందు లెండి.

వీళ్ళకి కాలం ఖర్మం కలిసొచ్చి (కలిసి రాక) పెళ్లి అయింది. వీళ్ళ భర్తలూ పాపం స్నేహితులే. వీళ్ళ స్నేహాన్ని చూసి దేవుడికి కుళ్ళు పుట్టిందేమో... పాపం వాళ్ల వాళ్ల భర్తలు ఒకేసారి యాక్సి డెంటు లో మరణించారు.

అమ్మలక్కలూ, అయ్యలన్నలూ వచ్చి వారిని పరామర్శించే వారు. కొంతకాలానికి 'భీమవరం బిపాషా బసు' ఒకతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖం గాఉంది. ఐతే ఆమె స్నేహితురాలు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్' మాత్రం విషాదం లోనే మునిగి ఉంది. (ఇక్కడ విలువలగురించి కాదు. విషయం వేరే!).

అప్పుడు అమ్మలక్కలూ, అయ్యలన్నలూ, తనతో "ఎందుకమ్మాయీ అంత బాధ పడి పోతావూ... పాపం! ఎంతకాలమలా ఉంటావ్/ నువ్వూ ఉప్పూ కారం తినే దానివే కదా! చిన్న వయసు లోనే ఎంత కష్టం?" అనే వాళ్లు. కొంత కాలం తరువాత "అమ్మాయీ! మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా గతాన్ని మరచి పోయి జీవితాన్ని అనుభవిన్చమ్మా! చిన్న దానివి. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాలి." అన్నారు.

ఇక 'భీమవరం బిపాషా బసు' గురించి మాత్రం "భర్త పోయి రెండేళ్లన్నా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతోంది. చూడమ్మా చోద్యం!!!???" అన్నారు.

అందుకే 'మై డియర్ ఫ్రెండ్స్...' లోకుల గురించి కాదు. మన గురించి బ్రతకాలి. వారికి కావలసింది కేవలం 'ఉపదేహామ్రుతాన్ని' పంచి పెట్టే మహదవకాశం.

'ఉపదేశామృతం' మాట 'వైష్ణవి' వ్రాసిన 'దీపావళి వంటకం' లో చూశాను. పదం బాగుందని adopt చేసుకున్నాను. తనకి థాంక్స్. ఒప్పుకున్నందుకు.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP